ఈ మధ్య కాలంలో బిజెపి నేతలు పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఇప్పుడు కొంత మంది నేతలు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం తర్వాత మరికొంత మంది నేతలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోకిడి నర్సింహ రెడ్డి గార్డెన్ లో బీజేపీ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

టీఆర్ఎస్ అంటే అవినీతి పార్టీ అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ను బంగారు తెలంగాణా చేస్తా అని కెసిఆర్ అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ గా మార్చాడు అని మండిపడ్డారు. హైదరాబాద్ లో వచ్చిన ఫలితాలు సిద్దిపేట లో కూడా వస్తాయి అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి లో కేంద్రం వాటా చెప్పడానికి టిఆర్ఎస్ భయపడుతుంది అని ఆయన వెల్లడించారు. సిద్దిపేట లో చేసిన సర్వేలు చూసి టిఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదు అని ఎద్దేవా చేసారు. రాబోయే ఎన్నికల్లో టిఅర్ఎస్ మునిగిపోతుంది అని ఆయన ఆరోపించారు.

దేశంలో భవ్య రామమందిర నిర్మాణం ద్వారా అందరి కలలు సాకారం అవుతున్నాయి అని ఆయన అన్నారు. 370 రద్దు బీజేపీ తో సాధ్యం అయింది అని ఆయన పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం ప్రతి గడపకు తీసుకెళ్లండి అని సూచించారు. అందరిని అయోధ్య రామమందిర నిర్మాణం లో భాగస్వాములు చేయండి అని రాజా సింగ్ విజ్ఞప్తి చేసారు. సిద్దిపేట మున్సిపల్ లో ఎంత అవినీతి జరిగిందో లెక్కలు తీయండి అని ఆమె వెల్లడించారు. సిద్దిపేట లో ఉన్న మట్టి పులి అరవదు, కరవదు దానిని  ద్వంసం చేయాలి అని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: