తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ మాఫియా డెన్‌గా మారిందన్నారు. మై హోమ్ రమేశ్వర్ రావు ప్రాసిక్యూట్ అవుతారని చెప్పారు. మైనింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకి వెళ్లటం ఖాయమన్నారు ఎంపీ అర్వింద్. కేటీఆర్ కు ఏ అర్హత ఉందని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారని ధర్మపురి అర్వింద్ విమర్శించారు.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నాశనం చేశారని, ఉద్యమంలో ముందు నుంచి ఉన్న వాళ్లు కనుమరుగయ్యారని  విమర్శించారు. తెలంగాణ ద్రోహులందరు మంత్రులయ్యారన్నారు.

    దేశ ద్రోహులతో చేతులు కల్పిన  టీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదన్నారు ఎంపీ అర్వింద్. సిఎం సహా  టీఆరెస్ నేతలంతా ఒవైసీకి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత మళ్లీ పోటీ చేస్తారని తాను భావించలేదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ను కంట తడి పెట్టించిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని, సంస్కార హీనుడు కేసీఆర్ అని విమర్శించారు అర్వింద్.  పాస్ పోర్ట్ బ్రోకర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఆయన దుయ్యబట్టారు.

      తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత కూడా టీఆర్ఎస్ కు లేదని అరవింద్ అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తదుపరి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అన్నారు. హిందువులపై దాడి చేస్తే ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు. బిజెపికి బయపడి జిహెచ్ఎంసి ఎన్నికలు ముందస్తుగా నిర్వహించారని చెప్పారు. కేసీఆర్ చెంచాలు పిచ్చి కూతలు కూస్తే ఉరుకోబోమని  హెచ్చరించారు. కేసీఆర్ మహార్భాని కోసం పిచ్చి కూతలు కూస్తే జనం మిమ్మల్ని తరిమికొడతారని చెప్పారు.వారసత్వ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ కు బిజెపి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: