ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత ఆయుధ రంగం మొత్తం కొత్త పుంతలు తొక్కుతూ అటు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక ఇప్పుడు.. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా సరికొత్త ఆయుధ టెక్నాలజీని కనుగొన్నారు భారత శాస్త్రవేత్త. భారత సైనికుల కోసం వారణాసికి చెందినటువంటి.. శ్యామ్ చౌరాసియా అనే శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి షూస్ తయారు చేశారు. బుల్లెట్లు కురిపించేటువంటి షూస్ ఆవిష్కరించారు.
బుల్లెట్లు కురిపించే షూస్ కి సంబంధించిన సెన్సార్ లను బార్డర్లో సెట్ చేస్తారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టువంటి శత్రువులను గుర్తించి షూస్ బుల్లెట్లతో దాడి చేయగలదు అని సదరు శాస్త్రవేత్త చెబుతున్నాడు. ఇక ఒక్కొక్క షూ ఆరున్నరా కిలోల వరకు ఉంటుందని.. శీతల ప్రాంతాల్లో ఈ షూస్ లోని హీటర్లు సైనికులకు ఉష్ణాన్ని కూడా విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలే ఈ వినూత్న ఆవిష్కరణ గురించి కేంద్రానికి లేఖ రాశారు శాస్త్రవేత్త. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.