ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు తీవ్ర తరం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో తలెత్తిన వివాదం కాస్త సద్దుమణిగి ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్ర సద్దుమణుగుతున్నాయి  అనుకుంటున్న తరుణం లో ఇక చైనా ఎన్నో డబుల్ గేమ్స్ ఆడుతూ ఉద్రిక్త పరిస్థితు లను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ క్రమం లోనే భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. చైనాకు ఎక్కడికక్కడ చెక్ పెట్టే విధంగా..  ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం డ్రాగన్  దేశానికి ఊహించని షాక్ ఇస్తుంది అనే విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం చైనా పై కనిపించని యుద్ధం చేస్తుంది భారత్.  ఎక్కడికక్కడ ఆర్థికం గా దెబ్బ కొట్టేందుకు ఇప్పటికే ఎన్నో రకాల కీలక నిర్ణయాలు తీసుకుంది   అన్న విషయం తెలిసిందే. అదే సమయం లో అటు ఉగ్ర దేశాలకు అండగా నిలబడితు చైనా   ఆయుధాలను సరఫరా చేస్తుంది అనే విషయాన్నీ  శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ప్రపంచ దేశాలకు ఆధారాల తో తెలియ జేయడంలో అటు భారత్ విజయం సాధిస్తుంది. ఇక చైనా చేస్తున్న అరాచకాలను ప్రపంచదేశాలకు తెలియజేసే విధంగా.. భారత్ ఎన్నో  వ్యూహాలు అమలు చేస్తుంది.



 ఇక ఇటీవల చైనా కు సంబంధించినటువంటి మరో కీలక సమాచారం బయటపడింది. సీక్రెట్ ఏజెంట్ సహాయంతో హవాలా రాకెట్ చైనీయులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇటీవలే ఈడి పసిగట్టింది. సాధారణంగా చైనాలో ఏం జరిగినా కూడా అది కేవలం ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే . దీంతో పాలనలో ప్రభుత్వానికి తెలియకుండా ఏం చేయడానికి అసలు వీలుండదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న హవాలా రాకెట్  కూడా ప్రభుత్వ హయాంలోనే సీక్రెట్ ఏజెంట్ ద్వారా జరుగుతుంది అన్నది ఇటీవలే ఈడి గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: