రాజకీయాలు, పాలన బాగుంటే సరిపోయే రాజకీయాలు  కావివి - బాగున్నట్లు కనిపించాలి కూడా. కాని ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు చాలా భిన్నం. ప్రధాన ప్రతిపక్షంతో సహా మరో ప్రధాన విపక్షం అవకాశాల కోసం కాపు కాసి కూర్చున్నాయి. ఈ మధ్య జరుగుతున్న హిందూ దేవుళ్ళ విగ్రహాల,  దేవాలయాల, విధ్వంస క్రీడ యధేచ్చగా కొనసాగుతూ ఉండగా రాష్ట్రాధినేతకు మతస్థులు, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకు ఏమైనా సంబంధాలున్నాయా? అన్న దిశలో అనుమానాలు పొడచూపుతున్నాయి. దాని కథాకమామిషు ఒకసారి పరిశీలిద్ధాం

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్న సంగతి తెల్సిందే. అయితే ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక పాస్టర్ - “ప్రముఖ - యూట్యూబ్‌ చానల్‌” లో కొంత కాలంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేస్తువన్నారు.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన మంత్రి కన్నబాబుకు తాను అనుచరుడినని ఈ పాస్తర్ ప్రవీన్ చక్రవర్తి చెప్పుకుంటాడు. ఆలాగే బ్రదర్‌ అనిల్‌కు చెందిన మత ప్రచార సంస్థ తో అతి సన్నిహితంగా ఉంటారు. ఇతడు ఒక మంత్రితో మాత్రమే కాకుందా ఒక ఎంపీ, పలువురు వైసిపి నాయకులతో సన్నిహితంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి యూట్యూబ్ చానల్లో ఇలా ప్రవచించారు

"రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు నేనే చేశాను. దేవతల విగ్రహాల తలలు తొలగించాను. పలు దేవతా విగ్రహాలను ధ్వంసం చేశాను. అందులో నాకు చాలా ఆనందం కలిగింది. అలాగే ఇంకొందరు నా సహచర పాస్టర్లతో పలు చోట్ల ఇలాంటి దాడులు చేయించాను. ఈ దేవుళ్ల విగ్రహాలన్నీ ఫేక్‌. నా అసోసియేషన్‌లో 3,642 మంది ఫాస్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 699 గ్రామాలను పూర్తిగా “ క్రైస్తవ గ్రామాలు” గా మార్చివేశాము. త్వరలో ఇంకొన్ని గ్రామాలను కూడా ఇలాగే చేస్తాం" క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇతనికి బ్రదర్ అనీల్ సంస్థలతో ఉన్న దగ్గరి సంబంధం రాష్ట్రాధినేతకు కడుంగడు సమస్యలు సృష్టిస్తున్నాయి.

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆస్తులను చూసిన పోలీసులు షాకుకు గురయ్యారని తెలుస్తుంది. ఏ  వ్యాపారాలు చేయని  దిగువ మధ్య తరగతి కుటుంబ నేపధ్యం ఉన్న, ఈ 35 ఏళ్ల వయసున్న ఈ పాస్టర్ చక్రవర్తి  ప్రస్తుత ఆస్తుల విలువ దాదాపుగా వెయ్యి కోట్లు రూపాయలని అంచనా. ఇక ఇతని ప్రధాన వ్యాపారం “మత మార్పిళ్లు చేసి విదేశాల నుంచి నిధులు రాబట్టుకోవడడం” మాత్రమేనట.

ఈ ఏడాది జనవరి 11 న అమెరికాకు చెందిన విరాళాలిచ్చే ఒక క్రైస్తవ ధాతతో ఆన్‌లైన్‌ లో మాట్లాడుతూ “దేవుడి విగ్రహాలు అంతా ఫేక్‌, ఎన్నో విగ్రహాలు నా చేతులతో ధ్వంసం చేశాను” అని అయన స్వయంగా  యూట్యూబ్‌ చానల్‌ సాక్షిగా వెల్లడించారు.  తాజాగా ఈ వీడియోలు ఆడియోలు వైరల్‌ అయ్యాయి.

ఈ విషయంపై సింగం వెంకట శ్రీలక్ష్మీ నారాయణ అనే గుంటూరుకు చెందిన వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు, “మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణం” తో చక్రవర్తిపైన పలు సీఅర్పీసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకునే సమయంలో సీఐడీ పోలీసులపై ఈ పాస్టర్ చక్రవర్తికి చెందిన బౌన్సర్లు దాడి చేసినట్లు సమాచారం.

విదేశాల నుంచి భారీ స్థాయిలో అందుతున్న విరాళాలతో గత కొంతకాలంగా కాకినాడ, సామర్లకోట ప్రాంతాల్లో  “మదర్‌ థెరిస్సా" పేరుతో పలు పాఠశాలలు, కేటీసీ చిల్డ్రన్‌ హోం, సిలోన్‌ బ్లైండ్‌ సెంటర్‌(సిబీసీ) నిర్వహిస్తున్నారు ఈ క్రైస్తవ మత ప్రచారకుడు.

వాకలపూడిలో “శార్వాణి పాఠశాల” ను విదేశీ విరాళాల ద్వారా అందిన సొమ్ముతో కొనేసి ఈ మధ్యనే  స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో 15 ఎకరాల్లో ఒక “పీవీఆర్‌ఎం” ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ “ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌” తరగతులను నిర్వహిస్తున్నారని ప్రచారంలో ఉంది. మత ప్రచారం పేరుతో పలు విద్యాసంస్థలు నడుపు తున్నారు పాస్టర్ చక్రవర్తి.
ఆనాధ బాలికల కోసం పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అందులో నిరుపేదలు, ఇటుక బట్టీల కార్మికులను ఎంపిక చేసి, చదువు పూర్తైన తరువాత వీరందరిని “క్రైస్తవ మతంలోకి మార్పిడి” చేయిస్తూ, దీని కోసం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు కూడా సాధించు కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంధుల కోసం ఏర్పాటు చేసిన “ఎస్‌బీసీ”లో అంధ విద్యార్థులు ఎవరూ లేరని వార్తలు.

ఈ పాస్టర్ ప్రవీణ్ పాపాల చిట్టా తవ్వుతున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతడు తన వద్ద పని చేసే ఒక యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను వంచించి అనుభవించి గాలికి వదిలి వేయడంతో బాధితురాలు అందోళనకు దిగింది. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తన రక్షణకు “ప్రైవేటు వ్యక్తులతో చిన్న సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 50 మందికి పైగా బాడీ గార్డులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 15000/- నుండి రూ. 20000/- వరకూ జీతభత్యాలుగా చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలా ఉండగా పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినప్పటి నుండి రాష్టృఅంలో పరిస్థితులు త్వరితగతిన మారిపోతున్నాయి. విగ్రహాలపై దాడి ఘటనలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని రెండు రోజుల క్రితం ప్రకటించిన డీజీపీ మళ్ళీ మాట మార్చి, తరవాత 15 మంది టీడీపీ, నలుగురు  బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయని ప్రకటించారు.

పాస్టర్ ప్రవీణ్, సిఎం జగన్ బావ బ్రదర్‌ అనిల్‌, స్వంత మత ప్రచార సంస్థకు సన్నిహితులా? అయితే ఈ విధ్వంసాల వెనుక…..? అయితే ఈ కేసులలో ఎక్కువగా సోషల్ మీడియా ప్రచారాల గురించే ఉండగా, పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం ఏ మాత్రం హైలెట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం,
పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని ప్రతిపక్షాలతో పాటు కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: