చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. నాలుగుసార్లు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు దక్కడం లేదని.. వెన్నుపోటుదారులకు పెద్ద పీట వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీలో చేరిన ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు మోదీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని.. కేసీఆర్ సర్కారు ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ను సవాల్ చేసే సత్తా తెలంగాణలో బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్థానం ముగిసిందన్నారు. సర్పంచ్ని కలెక్టర్ సస్పెండ్ చేసేందుకు వీలు కల్పిస్తూ.. జీవో తెచ్చిన కేసీఆర్.. సీఎంను కూడా చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేసే జీవో తేవాలని ఆయన డిమాండ్ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్పై.. ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. వికారాబాద్ని చార్మినార్ జోన్లో కలపాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. నాలుగుసార్లు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు దక్కడం లేదని.. వెన్నుపోటుదారులకు పెద్ద పీట వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీలో చేరిన ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు మోదీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని.. కేసీఆర్ సర్కారు ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ను సవాల్ చేసే సత్తా తెలంగాణలో బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్థానం ముగిసిందన్నారు. సర్పంచ్ని కలెక్టర్ సస్పెండ్ చేసేందుకు వీలు కల్పిస్తూ.. జీవో తెచ్చిన కేసీఆర్.. సీఎంను కూడా చీఫ్ సెక్రటరీ సస్పెండ్ చేసే జీవో తేవాలని ఆయన డిమాండ్ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్పై.. ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. వికారాబాద్ని చార్మినార్ జోన్లో కలపాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.