తెలంగాణాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకు ఇప్పుడు తెరాస పార్టీ కంగారు పడుతుంది. ఆయన చేసే విమర్శలు ఆ పార్టీని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్... ఎవరు హిందువో నాగార్జున సాగర్ లో తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. డీఎన్ఏ పరీక్షకు నేను‌ సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా?  అని నిలదీశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆదేశిస్తే మెరిగే కుక్కలు  అంటూ ఆయన ఆరోపించారు.

తెలంగాణకు కాపాలగా ఉంటానన్న కుక్క ఫాంహౌస్ లో పడుకుంది అని విమర్శలు చేసారు. కేసీఆర్ అంతు చూడటానికే మూడు సార్లు చావు దాక వెళ్ళి నన్ను దేవుడు వెనక్కి పంపించాడు అని మండిపడ్డారు. కేసీఆర్ జైల్ కు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన  వార్నింగ్ ఇచ్చారు. ఎవరు నిజమైన హిందువో .. నాగార్జున సాగర్ గడ్డ మీద తేల్చుకుందాం అని అన్నారు. హిందువు సమాజం ఓటు బ్యాంక్ మారితే కేసీఆర్ కొట్టుకుపోతాడు అని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ లో హిందువులపై మొరిగిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి  చెప్పినా సిగ్గు రాలేదు అన్నారు.

తాండూరు బండకేసి కొడతారన్న భయంతోనే కేసీఆర్ వికారాబాద్ జిల్లా మొహం చూడటంలేదు అని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో అందమైన వికారాబాద్ .. వికారమైన నగరంగా మారింది అని ఆయన ఆరోపించారు. వాహన దారులు యూటర్న్ చేస్తుంటే కేసీఆర్ గుర్తొస్తున్నారట అని ఎద్దేవా చేసారు. 13వేలకు పైగా కంపెనీలు,  మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. కేసీఆర్ పల్లకి మోస్త అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును  పండపెట్టి రైతులతో కేసీఆర్ ఆడుకుంటున్నాడు అని మండిపడ్డారు. వికారాబాద్ ను జోగులాంబ జోన్ నుంచి హైదరాబాద్ జోన్ లోకి తెచ్చే దాక కొట్లాడతాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: