దీంతో ఇటీవలే మమతపై తిరుగుబాటు ప్రకటించి బీజేపీలో చేరిపోయిన సువెందు ఒంటికాలుపై లేచి సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ కోల్కతాలో జరిగిన బహిరంగ సభలో సువెందు అధికారి మాట్లాడుతూ టీఎంసీ ఒక పార్టీ కాదని అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అన్నారు. ఎన్నికలప్పుడే మమతకి నందిగ్రామ్ గుర్తుకొచ్చిందని విమర్శించారు. నందిగ్రామ్ కి మమత ఏం చేసిందని ప్రశ్నించారు. టీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్క రాష్ట్రం నుంచి ప్రశాంత్ కిశోర్ను అద్దుకు తెచ్చుకున్నారని, దీన్ని బట్టే బీజేపీ గెలిచిపోతోందని అర్థమైపోతోందని ఆయన పేర్కొన్నారు. కాగా,ప్రస్తుతం భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. భవానీపుర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.పదేళ్ల క్రితం అధికారం వామపక్షాల నుంచి తృణమూల్ కాంగ్రెస్కు రావడానికి కారణం నందిగ్రామ్ ఘటనే. 2007లో నందిగ్రామ్లో సెజ్ ప్రాజెక్టు ఘర్షణల్లో 14 మంది రైతులు మరణించారు. వామపక్షాలపై మమతా బెనర్జీ.. అమ్మ, మట్టి, మనుషులు అనే నినాదాలను ఎక్కుపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే నందిగ్రామ్ ప్రాంతంలో సువేందు అధికారి కుటుంబానికి గట్టి పట్టుంది. అలాంటి నేత ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరారు. మళ్లీ నందిగ్రామ్ నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు.