సింధీలకు ప్రత్యేక దేశం..సింధు దేశ్ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. 1967 లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం కారణంగా సింధ్ వాసులు ఎన్నో వేధింపుల బారిన పడుతున్నారని ప్రొటెస్టర్స్ పేర్కొన్నారు. బెలూచిస్థాన్ ప్రజలు కూడా దాదాపు ఇదేవిధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి అనేకమంది మేధావులు, కళాకారులు, విద్యావేత్తలు పాక్ కు భయపడి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు. వాస్తవానికి సింద్ ఉద్యమానికి దశాబ్దాల చరిత్ర ఉంది. పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరుతూ ఉద్యమిస్తున్నారు.
ప్రత్యేక సింధ్ దేశం కోసం ఇప్పటికే అక్కడ పలు జాతీయ పార్టీలు ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ అంశాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూనే ఉన్నారు. పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని ఆక్రమించిందని, తమ వనరులను దోచుకుంటూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పుడుతున్నదని సింధ్ ప్రాంతానికి చెందిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ ప్రత్యేక సింధూదేశ్ కోసం ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఘనమైన సింధూ లోయ నాగరికతకు పేరుగాంచిన సింధ్ ప్రాంతాన్ని మొదట బ్రిటీషర్లు అక్రమంగా ఆక్రమించారని, ఆ తర్వాత దుష్ట ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్కు ధారాదత్తం చేశారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.