రాష్ట్రంలో  జగన్ గ్రాఫ్ బాగా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇరవై నెలలు కావస్తోంది. ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. మరో వైపు చూస్తే ఏపీలో విపక్షాలు తాము నిలబడేందుకు గట్టిగా పోరాటాలు చేస్తున్నా కూడా అవి పెద్దగా వర్కౌట్ కావడంలేదు. ఈ నేపధ్యంలో జగన్ కి రాజకీయంగా భారీ నష్టం చేకూర్చడానికి ఒక అతి ముఖ్యమైన ‌ ప్లాన్ రెడీ అయింది.

అదే బీజేపీ నేతల  రాజకీయ రధయాత్ర. కపిలతీర్ధం నుంచి రామతీర్ధం వరకూ అంటే దాదాపుగా ఏపీలో పది జిల్లాలను కవర్ చేస్తూ ఈ భారీ రధ యాత్రకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. దీని ద్వారా జగన్ సర్కార్ కూసాలు కదల్చాలని కూడా పెద్ద స్కీమ్  తోనే ఉంది.

నిజానికి రధ యాత్ర అంటే అద్వానీదే అని  అందరికీ కనిపిస్తుంది. ఆయన అప్పట్లో చేసిన రధ యాత్ర వల్ల బీజేపీ బాగా లాభపడింది. ఏపీలో కూడా ఇపుడు జగన్  ని దెబ్బతీసేందుకు బీజేపీ ఈ రధ యాత్ర తలపెట్టిందని అంటున్నారు. దీంతో జగన్ సర్కార్ పరిస్థితి అడ కత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది అంటున్నారు.

రధయాత్రకు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది కూడా ఎటూ తేల్చుకోలేకుండా ప్రభుత్వం ఉంది. రధ యాత్రకు అనుమతులు ఇవ్వకపోయినా నానా యాగీ చేయడానికి బీజేపీ రెడీగా ఉంది. అలా అయినా సర్కార్ కి ఆ వేడి సెగలు తగలడం ఖాయమని అంటున్నారు. మరి బీజేపీని ఏ విధంగా  అడ్డుకోవడం అన్న దాని మీద జగన్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోందిట. ఏది ఏమైనా భావోద్వేగాల్ను రెచ్చగొట్టే  బీజేపీ రధ యాత్ర ఏపీ రాజకీయాలను మారుస్తుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరో వైపు చూస్తే ఈ రధ యాత్రకు ధీటుగా వైసీపీ కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసే పనిలో ఉందని అంటున్నారు. అదేంటో కూడా చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: