ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేతలుగా పరిస్థితి మారింది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు  వాడి చరిత్ర దేశంలో లికించి  ఎన్టీఆర్ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచి పోయారు అని పేర్కొన్నారు. ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో  విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని ఆరోపణలు చేసారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చెయ్యాలి అని సవాల్ చేసారు.

ఎన్నికల ముందు పసుపు కుంకం వేస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారు అని అన్నారు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం అని ఆయన వెల్లడించారు. సవాల్ అయిన ప్రతి సవాల్ అయినా మేము రెడీ అని సవాల్ చేసారు.  అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు అంటే ఎలా అని ఆయన నిలదీశారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతూన్నారు అని మండిపడ్డారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదు అని పేర్కొన్నారు. 

ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోము  అని ఆయన అన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని ఆయన మండిపడ్డారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ అని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ టీడీపీ వేరు చంద్రబాబు టీడీపీ వేరు అని అన్నారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసు అని ఆయన తెలిపారు. ఉమా ఒక లోఫర్ అని విమర్శించారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి అని అన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవం అని ఆయన తెలిపారు. ఒక కులం వాళ్ళు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మేల్యలుగా గెలవలేదు అని అన్నారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: