అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. పైగా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఉమాను వ్యతిరేకించే వారంతా ఏకమవుతున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నానితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ ఆటాడుకుంటున్నారు. వీరిద్దరు అయితే ఉమాను ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు. తాజాగా ఉమా ఈ రోజు గొల్లపూడిలో ఒక రోజు దీక్షకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ మీడియాతో మాట్లాడుతూ ఉమాపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.
ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడడం చాలా కామెడీగా ఉందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఉమా తమతో చర్చకు రావాలని.. చర్చకు తాము రెడీగా ఉన్నామని.. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని వంశీ సవాల్ విసిరారు. ఒకటని .. రెండు అనిపించుకోవడం ఉమాకు అలవాటే అని వంశీ ఎద్దేవా చేశారు. ఇక ఉమా ఓ లోఫర్ అని కూడా ఎద్దేవా చేశారు.
ఏదేమైనా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఉమా వంశీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా నానా ఇబ్బందులు పెట్టాడన్నది వాస్తవం. ఇప్పుడు సందు దొరికింది కదా ? అని ఉమాను వంశీ ఓ ఆటాడేసుకుంటున్నాడు.