టీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌మ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు, తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు వైసీపీలోని నేత‌ల‌నే కాకుండా... త‌మ పార్టీలో కూడా ఎంతో మందిని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేశారు. ఆ మాట‌కు వస్తే ఇప్పుడు వైసీపీ మంత్రిగా ఉన్న కొడాలి నాని నుంచి మొద‌లు పెడితే వ‌ల్ల‌భ‌నేని వంశీ, దాస‌రి బాల‌వ‌ర్థ‌న్ రావు, ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు, కేశినేని నాని, నెట్టెం ర‌ఘురాం, మండ‌లి బుద్ధప్ర‌సాద్ ఇలా చాలామంది నేత‌లు ఉమా దెబ్బ‌కు రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు.. పైగా ఇది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం. దీంతో ఇప్పుడు ఉమాను వ్య‌తిరేకించే వారంతా ఏక‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నానితో పాటు  గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓ ఆటాడుకుంటున్నారు. వీరిద్ద‌రు అయితే ఉమాను ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు. తాజాగా ఉమా ఈ రోజు గొల్ల‌పూడిలో ఒక రోజు దీక్ష‌కు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ మీడియాతో మాట్లాడుతూ ఉమాపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు.

ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు, వ‌దిన‌ను చంపిన ఉమా రాజ‌కీయాల్లో విలువ‌లు గురించి మాట్లాడ‌డం చాలా కామెడీగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ద‌మ్ముంటే ఉమా త‌మ‌తో చ‌ర్చ‌కు రావాల‌ని.. చ‌ర్చ‌కు తాము రెడీగా ఉన్నామ‌ని.. ప్లేస్‌, టైమ్‌, డేట్ ఉమా ఫిక్స్ చేయాల‌ని వంశీ స‌వాల్ విసిరారు.  ఒక‌ట‌ని .. రెండు అనిపించుకోవ‌డం ఉమాకు అల‌వాటే అని వంశీ ఎద్దేవా చేశారు. ఇక ఉమా ఓ లోఫ‌ర్ అని కూడా ఎద్దేవా చేశారు.

ఏదేమైనా గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు ఉమా వంశీ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌ర‌గ‌కుండా నానా ఇబ్బందులు పెట్టాడ‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు సందు దొరికింది క‌దా ? అని ఉమాను వంశీ ఓ ఆటాడేసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: