ఆంధ్రప్రదేశ్ లో మంత్రి కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. మీడియా ముందు ఆయన మాజీ మంత్రి దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఉమాను కొడతాను అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడాలి నానీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కొడాలి నాని విశ్వాస ఘాతకుడు అని ఆయన ఆరోపించారు.

రెండు సార్లు గెలిపించిన టీడీపీ పై, చంద్రబాబు పై కొడాలి వ్యాఖ్యలు దారుణం గా ఉన్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నీతి లేని వ్యక్తి కొడాలి నాని అని మండిపడ్డారు. మంత్రులు మా సహనం పరిక్షిస్తున్నారు అని ఆయన అన్నారు. కొడాలి నాని కి లాస్ట్ వార్నింగ్.... నోరు అదుపులో పెట్టుకోవాలి అని ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ... బుతుల మంత్రి కొడాలి నాని పోరంబోకు మంత్రి అయ్యాడు అని మండిపడ్డారు. కొడాలికి చదువు లేదు... సంస్కారం లేదు అని ఆయన అన్నారు.

కొడాలి నాని ని పశువులతో కూడా పోల్చలేం అని అన్నారు. “WHo killed babay”  అనే స్లోగన్ కు భయపడి మాపై మంత్రులను పంపారు అని ఆయన వెల్లడించారు. సీఎం ఢిల్లీ ఎందుకు వెళ్లారు...ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్లారు అని నిలదీశారు. డిబేట్ కి స్పెల్లింగ్ తెలియని వారితో నేను చర్చించేది ఏంటి!? అని ఆయన ప్రశ్నించారు. ఆ స్థాయి కొడాలి నాని కి ఉందా అని ఆయన నిలదీశారు. కాగా నేడు దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఘాటుగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: