ఆకుకూరలు తినడం వలన శరీరానికి చాల మేలు జరుగుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి. రోజూ తినాల్సిన దానిలో సగం కూడా తింటలేరని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో వెల్లడైంది. విటమిన్లు, పోషకాలు చాలా ఎక్కువగా ఉండే ఆకుకూరలను సరిపోయినంత తినకపోవడం వల్ల జనం పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తేలింది. 

అయితే ఆకుకూరలల్లో పాలకూర, తోటకూర, మెంతికూరను కూడా చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. ఇక మెంతి ఆకులను పలు కూరల్లో కూడా వేసుకుంటుంటారు. అయితే ఇతర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. 

ఇక చలికాలంలో చెమట పట్టేలా వ్యాయామం చేయాలంటే అందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వ్యాయామం త్వరగా పూర్తి చేయవచ్చు. అలాగే చలికాలంలో బరువు తగ్గాలనుకునే వారు త్వరగా బరువు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 

అంతేకాక డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం సహజంగానే కొంత కష్టతరమవుతుంది. అలాంటప్పుడు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో జీర్ణ సమస్యలు కూడా సహజంగానే వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: