సోమవారం ఇరువురి వాదనలు వినిపించగా.. మంగళవారం కూడా కొనసాగాయి. ఎస్ఈసీ తరఫున సీనియర్ లాయర్ ఆదినారాయణరావు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని.. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని.. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్కు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని.. ఇంత వరకు ఎక్కడా జరగలేదన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
సోమవారం ఇరువురి వాదనలు వినిపించగా.. మంగళవారం కూడా కొనసాగాయి. ఎస్ఈసీ తరఫున సీనియర్ లాయర్ ఆదినారాయణరావు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని.. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని.. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్కు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని.. ఇంత వరకు ఎక్కడా జరగలేదన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.