చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండంల గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో .. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ ముగిసిన రెండు రోజులకు మూగ జీవాలకు వివాహం జరిపించడం కురవపల్లె అనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే , గొర్రెలను అంటువ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్థుల నమ్మకం. ఈ ఏడాది కూడా అనవాయితీ ప్రకారం.. గొర్రె, పొట్టేలుకు వైభవంగా కల్యాణం జరిపించారు. తొలుత దొడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసారు . అనంతరం గొర్రె, పొట్టేలులను వధూవరులుగా అలంకరించారు.
వరుడి వైపు కిరణ్కుమార్, వధువు వైపు దామోదర్ కుటుంబసభ్యులు నిలిచి ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. పెద్దల కాలం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం ద్వారా తమకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఇక, గొర్రె, పొట్టేలు కల్యాణానికి హాజరైన యువత సెల్ఫోన్లో వివాహ వేడక దృశ్యాలను చిత్రీకరించారు... ఇటువంటివి మనకి వింతగా అనిపించినా ఆ గ్రామస్తులకు మాత్రం ఇదొక పండగ జరుపుతుంటారు ..