ఈ క్రమం లోనే ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తీసుకో కూడదు అనే దానిపై అధికారులు సూచనలు సలహాలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే . అయితే ఇటీవలే తమ వ్యాక్సిన్ పై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ అలర్జీ కలిగితే తమ వాక్సిన్ తీసుకోవద్దు అంటూ స్పష్టం చేసింది సీరం. టీకా కు సంబంధించిన పూర్తి వివరాలను ఫ్యాక్ట్ షీట్ ని విడుదల చేసింది.
ఇక ఈ టీకా తయారీలో ఉపయోగించిన రసాయన పదార్థాల వల్ల ఎవరికైనా అలర్జీలు కలిగితే వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిది అంటూ తెలిపింది. అలాంటి వ్యక్తులు రెండోరోజు తీసుకోకుండా ఉండడం బెటర్ అంటూ స్పష్టం చేసింది సీరం ఇన్స్టిట్యూట్. అయితే ప్రజలు తమ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆరోగ్య సిబ్బందికి తమ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలపడం ఎంతో మంచిది అంటూ సూచించింది. అయితే ఇలా టీకా తీసుకునే వారిలో ఎవరికైనా అలర్జీ సమస్యలు ఉన్నాయి అంటే ముందుగా వైద్య సిబ్బందికి తెలపాలని.. సూచించింది.