ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాల కు అసలు విలువ లేకుండా పోతుంది అనే విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణా లకే కఠిన నిర్ణయాలు తీసుకుని ఎంతో విలువైన ప్రాణాల ను బలవన్మరణాల కు పాల్పడి తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యం గా అభం శుభం తెలియని వయసు లోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంతో మంది  చివరికి తల్లి దండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపు తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ముఖ్యం గా ఈ మధ్య కాలంలో చిన్న వయసు లోనే విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు టీచర్, తల్లిదండ్రులు మందలించారని  లేదా తాము అడిగిన వస్తువులు కొనివ్వలేదని ఇలా చిన్న చిన్న కారణాల కే క్షణి కావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నారు ఎంతో మంది చిన్నారులు. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. చెవి కమ్మలు కొనుక్కోవాలి అని అనుకుంది టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక బాలిక.



 ఈ క్రమం లోనే తనకు చెవి కమ్మలు కొనివ్వాలి అంటూ తల్లి దండ్రులను అడిగింది. అయితే ప్రస్తుతం డబ్బులు లేవని తర్వాత కొనిస్తాను అంటూ తల్లి దండ్రులు చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులను బంగారు కమ్మలు కొనివ్వాలి అని అడిగినప్పటికీ డబ్బులు లేక పోవడంతో తర్వాత కొనిస్తాం అంటూ చెప్పుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు. దీంతో మనస్తాపం చెందిన వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: