గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్ర వ్యాఫంగా సంచలనం అయింది. తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విజయ్ కుమార్... కేసులో అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే వివాహేతర సంబంధమై ఆత్మహత్యకు కారణమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేసారు. హనుమాన్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలపై గతంలో విజయ్ కుమార్  సస్పెండ్ అయ్యారు.

మూడు నెలల క్రితం ఆమెను విజయ్ కుమార్ వివాహం చేసుకున్నారు. భార్యను కాపురానికి తీసుకురాకుండా, గుడివాడలో బ్యూటీషియన్ తో కలిసి విజయ్ కుమార్ ఉంటున్నారు. విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో, ఫ్లాట్ లోనే ప్రియురాలు బ్యూటిషన్ సురేఖ ఉండటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తుంది. గుడివాడ స్థానికు రాలైన సురేఖ ఏలూరు రోడ్డు లో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసారు.

3 నెలల క్రితం వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు  జరిగాయి అనే దాని మీద ఆరా తీస్తున్నారు. భార్యకు విడాకులు తనను పెళ్లి చేసుకోవాలంటూ, విజయ్ కుమార్ పై సురేఖ ఒత్తిడి తీసుకొచ్చింది అని పోలీసులు అంటున్నారు. పెళ్లి విషయమై సురేఖ తరుచూ తనతో గొడవలు పడుతుందంటూ స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు విజయ్ కుమార్. బ్యూటీషియన్ సురేఖ పై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేసారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సురేఖను... రేపు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: