టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. కళావెంకట్రావ్ ను అరెస్ట్ చేసిన విధానం కేస్ పెట్టిన విధానం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. విజయసాయి మా ప్రోగ్రాం ను డిస్టర్బ్ చేయడానికి వస్తే అక్కడి భక్తులు అడ్డుకుంటే కళావెంకట్రావ్ పై కేస్ పెడతారా అని నిలదీశారు. పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడు...ఆయనకు ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ చెప్పాలి అని డిమాండ్ చేసారు. దేవినేని ఉమాను నిన్న పోలీస్ లు ఏమిచేశారు అని ప్రశ్నించారు. ఒక రౌడీ మంత్రి ఉమ ఇంటి కి వచ్చి కొడతా అంటారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.  

అనంతపురం లో ఒక ఎమ్మెల్యే ఇంటికి వస్తారా...అక్రమంగా మీరే ప్రవేశపెడతారా అని నిలదీశారు. ఒక సీఎం, ఒక డీజీపీ, ఒక హోమ్ మినిస్టర్, ఒకే మతం వాళ్ళు ఉంటే ఎం జరుగుతుంది చెప్పాలి అని డిమాండ్ చేసారు. డీజీపీ తాను ఒక మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ ను మీరెందుకు రహస్య ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. నిన్న మీరే క్రిస్టియన్ ల తో ప్రెస్ మీట్ పెట్టించి నన్ను క్షమాపణలు చెప్పమంటారా అని ప్రశ్నించారు. అమెరికా లో ఏమైంది... ఆ దేశ ప్రజలు ఆయన్ను ఇంటికి పంపారు. ఇక్కడ అదే జరుగుతుంది అని అన్నారు.

అయ్యన్నపాత్రుడు తన తాత ఫోటో తీశారు అని అడిగితే నిర్భయ కేస్ పెడతారాఅని ప్రశ్నించారు. మీరు దేవుళ్ళ విగ్రహాలు ద్వంశం చేస్తారా..అది మేము ఆడగకూడదా అంటూ ఫైర్ అయ్యారు. జగన్ నువ్వు క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్...నువ్వు హిందు దేవాలయాలను ఎందుకు కాపాడతావు అంటూ వ్యాఖ్యలు చేసారు. ప్రవీణ్ చక్రవర్తి లాంటి పాస్టర్ లను ఎంతమందిని పెట్టవు చెప్పాలి అని డిమాండ్ చేసారు. దేవినేని ఉమాను ఎన్ని పోలీస్ స్టేషన్ లు తిప్పారు. కళావెంకట్రావ్ ను ఎందుకు అరెస్ట్ చేశారు... ఇదే పునరావృతం అవుతుంది అన్నారు. నందం సుబ్బయ్య హత్య లాంటివి రాష్ట్రం లో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు. అమరావతిలో 401 రోజులుగా దీక్ష లు చేస్తుంటే ఒక్కసారైనా వారితో మాట్లాడారా... ఢిల్లీ లో రైతులతో 10 సార్లు చర్చలు జరిపారు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: