పనేమీ లేక ఖాళీగా ఉండటంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు ఇక్కడ అన్నదమ్ములు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఒక ఊరిలో అర్ధరాత్రివేళ దొంగతనానికి వెళ్లారు. చివరికి దురదృష్టం బాగాలేక అక్కడ గ్రామ సమీపంలో ఉన్న ఊరి చెరువులో శవాలుగా తేలారు ఆ దొంగలు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక విచారణలో ఆ ఇద్దరు అన్నదమ్ములు దొంగలే అని దొంగతనానికి బయలుదేరినప్పుడే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో వీరన్న పల్లి తండా లో వెలుగులోకి వచ్చింది. రమేష్, వినోద్ అనే ఇద్దరు యువకులు కూడా అన్నదమ్ములు. ఎన్నో రోజుల నుంచి పని లేక ఖాళీగానే ఉంటున్నారు. దీంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట ఎల్లమ్మ గుట్ట తండా లో దొంగతనానికి వెళ్లారు. ఇక చివరికి దొంగతనం చేస్తూ పట్టుబడటంతో గ్రామస్థులు వారిని తరిమి కొడుతున్న సమయంలో పారిపోతూ చెరువు చెట్ల పొదల్లో దాక్కున్నారు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న ఇద్దరు కూడా ప్రమాదవశాత్తు చెరువు నీటిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.