ఇక ఈ రెండు పాలసీలలో అకౌంట్లు కలిగి ఉన్నవారు డబ్బులు కట్టాలి అంటే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు కు వెళ్లేవారు కానీ ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సులభంగా ఈ పథకాల్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎక్కడికి వెళ్లకుండా నే ఆన్లైన్ లోనే డబ్బులు డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కలిగినవారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పలు రకాల సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. బాలన్స్ చెక్ చేసుకోవడం,మనీ ట్రాన్స్ఫర్, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సర్వీసులు కూడా పొందేందుకు ప్రస్తుతం కస్టమర్లకు వీలు ఉంటుంది.
ఇక అంతే కాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం డక్ పే అనే డిజిటల్ పేమెంట్ యాప్ ను కూడా తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రెండు పథకాలలో అకౌంట్ కలిగి ఉంటే ఈ యాప్ ను ఉపయోగించి ఎంతో సులభంగా డబ్బులు కట్టేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అటు కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు సుకన్య సమృద్ధి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలని భావిస్తే.. ఐపీపీబీ అకౌంట్కు డబ్బులు యాడ్ చేసుకోవాలి. తర్వాత డీఓపీ ప్రొడక్టుల్లోకి వెళ్లాలి. ఇక్కడ సుకన్య సమృద్ధి అకౌంట్ ఎంచుకోవాలి. మీ ఇన్స్టాల్మెంట్ డబ్బు ఎంతనో ఎంటర్ చేయాలి. ఓకే చేయాలి. కేవలం సుకన్య సమృద్ధి అకౌంట్ మాత్రమే కాకుండా పీపీఎఫ్, ఆర్డీ వంటి వాటిల్లో కూడా ఇలాగే డబ్బులు డిపాజిట్ చేయొచ్చు.