ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా మాట్లాడారు. ఏలూరుకి సంబంధించి పరిస్థితి అదుపులోనే ఊంది అని అన్నారు. మళ్ళీ పూళ్ళ, కొమిరేపల్లిలో ఇటువంటి కేసులు వచ్చాయి అని అన్నారు. సియం ఆదేశాలతో ఇక్కడకు రావడం జరిగింది ఆని ఆయన తెలిపారు. ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదు .. అందరూ కోలుకుంటున్నారు అని వెల్లడించారు. వాటర్ లేదా ఇతర కారణాల వలన వచ్చిందా అనేది పరిశీలించాల్సి ఉంది అని అన్నారు. కొమిరేపల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ మంచినీరు వచ్చే నీటి వనరులు టెస్ట్ లు చేయాలన్నారు.
అవసరమైతే కేంద్ర సంస్థల సహకారం తీసుకుంటాం అని తెలిపారు. నివేదికలు వచ్చిన తరువాత శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటాం అని ఆయన వివరించారు. సాయంత్రం సీయం కు నివేదిక ఇస్తాం అని అన్నారు. ఏలూరుకు సంబంధించి అన్ని సంస్థలు డిటైల్డ్ రిపోర్టులు ఇచ్చాయి అని వెల్లడించారు. వాటిని సీయం పరిశీలనలో ఉంచారని అన్నారు. జిల్లాకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలోని అప్పట్లో డిటైల్డ్ రిపోర్టులో పేర్కొన్నారు అని వివరించారు. వాటి ప్రకారం శాశ్వత చర్యలు తీసుకోవాలని అప్పట్లో హై లెవెల్ కమిటీ నిర్ణయం తీసుకుంది అన్నారు. ప్రతీ జిల్లాలో అన్ని రకాల పరీక్షలు చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అన్నారు.