ముఖ్యంగా జీవో ఎంఎస్ నెంబర్: 57 అనగా గత విద్యా సంవత్సరంలోని ట్యూషన్ ఫీజుకు 30 శాతం తగ్గించాలని అది కూడా విడతల వారీగా వసూలు చేయాలని చెబుతోంది అని పేర్కొన్నారు. అయితే ఫీజుల విషయంలో కళాశాలలు చాలా అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసింది అని వివరించారు. అలాగే కళాశాలల్లో కనీస వసతులు ఉండటంలేదు అని, కొన్ని చోట్ల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని అన్నారు. కమిషన్ వీటన్నిటినీ ప్రజలకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఉంది అని ఆయన వివరించారు.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాము అని ఆయన వివరించారు. అధిక పీజులు వసులు చేస్తున్నాయని భావిస్తే కళాశాల మారవచ్చు అని సూచించారు. అందుకు సంబంధించిన ఎర్పాట్లు కమిషన్ చేపడుతుంది అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కలసి కట్టుగా ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫిజులే కట్టవచ్చు అని పేర్కొన్నారు. కొన్ని కళాశాలలో కనీస వసతులు లేవు అని అన్నారు. కోవిడ్ నిబంధనలు అసలు పాటించడం లేదు అని మండిపడ్డారు. ప్రభుత్వ జీవో లను ప్రక్కన పెట్టి ఇష్టాను సారంగా పీజులు వసులు చేస్తున్న కళాశాల గుర్తింపు ను రద్దు చేయాలని కమిషన్ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంది అని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై ఎవరైన ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. విద్యార్ధులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.