స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి అక్కడ కూడా షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, ముందు దాన్ని సరి చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ను వెనక్కి పంపింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్ను సరిచేసి దాఖలు చేయలేమని వైసీపీ లాయర్లు చెప్తున్నారు. మధ్యలో ఆదివారం కోర్టుకు సెలవు ఉండటంతో సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి మరో ఛాన్స్ దొరకడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి అక్కడ కూడా షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, ముందు దాన్ని సరి చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ను వెనక్కి పంపింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్ను సరిచేసి దాఖలు చేయలేమని వైసీపీ లాయర్లు చెప్తున్నారు. మధ్యలో ఆదివారం కోర్టుకు సెలవు ఉండటంతో సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి మరో ఛాన్స్ దొరకడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.