ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో తనకు అర్థం కావడంలేదని పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా ఉందని, పంచాయతీ ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతోందని, మరి ఇలాంటి సమయంలో స్థానిక ఎన్నికలు జరగాలా? వద్దా? అన్న మీడియా ప్రశ్నకు పవన్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ‘‘నిజంగా వైసీపీ ప్రభుత్వానికి కరోనా మహమ్మారే ఇబ్బంది అయితే ఆలోచించ వచ్చని, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా పీక్స్లో ఉన్న సమయంలో బర్త్డే పార్టీలు చేసుకున్నారు. మద్యం షాపులు ప్రారంభించారు. దాంతో గుంపులు గుంపులుగా ప్రజలు క్యూలైన్లో నిలుచున్నారు. అప్పుడు కరోనా లేదా?’’ అని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని వాదించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని, ఎన్నికలకు తాము మద్దతు ఇస్తామని పవన్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో తనకు అర్థం కావడంలేదని పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా ఉందని, పంచాయతీ ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతోందని, మరి ఇలాంటి సమయంలో స్థానిక ఎన్నికలు జరగాలా? వద్దా? అన్న మీడియా ప్రశ్నకు పవన్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ‘‘నిజంగా వైసీపీ ప్రభుత్వానికి కరోనా మహమ్మారే ఇబ్బంది అయితే ఆలోచించ వచ్చని, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా పీక్స్లో ఉన్న సమయంలో బర్త్డే పార్టీలు చేసుకున్నారు. మద్యం షాపులు ప్రారంభించారు. దాంతో గుంపులు గుంపులుగా ప్రజలు క్యూలైన్లో నిలుచున్నారు. అప్పుడు కరోనా లేదా?’’ అని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని వాదించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని, ఎన్నికలకు తాము మద్దతు ఇస్తామని పవన్ స్పష్టం చేశారు.