పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే గొప్ప వేడుక.. నూరేళ్ళ జీవితాన్ని మరొకరితో పంచుకోవడానికి పెళ్లి సరైన మార్గం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒకసారి ఒక్కరితోనే జరుగుతుంది. కానీ ప్రబుద్ధుడు పది పెళ్ళిళ్ళు చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అతను కేవలం పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతని సంతానం కలగలేదు. కోట్ల ఆస్తి ఉన్నా కూడా వారసులు కలుగ లేదు..ఇకపోతే భార్యలు కూడా లేకపోవడంతో అతని ఆస్తి పై కన్నేసిన కొందరు అతన్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో వెలుగు చూసింది. బరేలి జిల్లాకు చెందిన జగన్ లాల్ యాదవ్‌ 1990 నుంచి ఇప్పటి వరకు పది పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఐదుగురు భార్యలు అనారోగ్యంతో చనిపోయారు. ముగ్గురు భార్యలు యాదవ్‌ను వదిలేసి వెళ్లిపోయారు. ఇక మిగిలిన ఇద్దరు భార్యలు యాదవ్‌తోనే ఉంటున్నారు. అయితే ఈ పది మంది భార్యలకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మొదటి భార్య, మొదటి భర్త కుమారుడు యాదవ్‌తోనే ఉన్నాడు.



అయితే ఆస్తి కోసం తన భార్యల పిల్లలు గొడవలకు దిగారు.ఈ క్రమంలో మొదటి భార్య కుమారుడి పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని వేరే భార్య కొడుకు పలుమార్లు అడిగాడు. దానికి అతను ససేమిరా అన్నాడు.జగన్ లాల్ యాదవ్ నిత్య పెళ్లి కొడుకుగా మారడంతో ఆయన తండ్రి తన ఆస్తిని మొత్తాన్ని పెద్ద కుమారుడి పేరిట రాసిచ్చాడు. దీంతో జగన్ కోర్టుకు వెళ్లి.. ఆస్తిలో కొంత భాగాన్ని తన పేరు మీద దక్కించుకున్నాడు. ఈ ఆస్తి విలువ కోట్ల రూపాయాల్లో ఉంటుంది. ఈ ఆస్తి కోసం మొదటి భార్య కుమారుడికి, యాదవ్ మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి బుధవారం రాత్రి రైతు జగన్‌ను అపహరించి గొంతు నులిమి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: