కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 55మందికి పైగా మంది మరణించగా, వందల మంది గాయపడ్డారని ఆ దేశ విపత్తు సంస్థ తెలిపింది. ఇండోనేషియాలోని మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్లు దూరంలో సులవేసి దీవుల్లో 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం దాదాపు ఏడు సెకన్ల పాటు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో వెస్ట్ సులవేసి రాష్ట్రంలోని మముజు నగరంలో 34, దక్షిణ ప్రాంతంలో మరో ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. ఎంత మంది ఆచూకీ గల్లంతయ్యిందన్న విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన ఇంటి శిధిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కుటుంబ సభ్యులను వెలికి తీయడానికి సహాయ సిబ్బంది ప్రయత్నించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సముద్రాలకు ఆనుకుని ఉన్న దేశాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి.
గడిచిన దశాబ్దకాలంలో సముద్రాలకు ఆనుకుని ఉన్న దేశాల్లో పర్యావరణ విపత్తులు పెరిగినట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.