ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పోలీసులు విపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్న విధానంపై ఇప్పుడు పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటంతో పోలీసులు విపక్ష నేతల మీద నమోదు చేసిన కేసులు కూడా ఇప్పుడు విస్మయానికి గురిచేస్తున్న పరిస్థితి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ నివాసం ముట్టడికి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. అయితే ఇప్పుడు ఈ విభాగంపై పెట్టిన కేసులు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

అత్యాచార యత్నం కేసు పెట్టడంతో జడ్జి కూడా విస్మయం వ్యక్తం చేశారు. సీఎం నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు పై ఈ విధంగా కేసులు పెట్టడం ఏంటి అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో విమర్శలకు దారి తీసింది. జాతీయ మీడియా కూడా ఈ కేసుపై ఆశ్చర్యంగా చూసింది. స్థానిక మీడియా కూడా ఇదే అంశాన్ని పదేపదే హైలెట్ చేస్తూ వస్తున్నది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు కూడా పోలీసుల తీరును చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వైసిపి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి ఎలా ఉంది అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోలీసుల విషయంలో ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు విపక్షాలు చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి ఆలోచన లేని కేసుల కారణంగా పోలీసులు చులకన అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈ కేసుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో పోలీసుల మీద ప్రజల్లో నమ్మకం పోతుందని అంటున్నారు. పోలీసులు పెట్టే కేసుల మీద కూడా ప్రజల్లో నమ్మకం ఉండదు అని అంటున్నారు. ప్రజలు కూడా పోలీసులను లెక్కచేసే అవకాశం ఉండదు. భవిష్యత్తులో అయినా సరే అయితే పోలీసులు జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: