సాఫీగా సాగిపోతున్న భార్యా భర్తల బంధంలోకి అక్రమ సంబంధాలు తుఫానులా వచ్చి జీవితాలను నాశనం చేసుకొనే లా చేస్తాయి. అంతేకాదు కుటుంబ కలహాలకు దారి తీస్తాయి. ఆ గొడవలతో కుటుంబాలు విడిపోవడం లేదా ప్రాణాలను కోల్పోవడం లాంటి ఘటనలు ఎక్కువగా చూస్తుంటాము.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అమానుష ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. 



వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర సంబంధం చిచ్చురేపింది. అది కాస్తా కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది. చివరకు భార్య మరణానికి దారి తీసింది. విశాఖ పట్టణం జిల్లాలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణం జిల్లా కోటవురట్ల మండలం, కైలాసపట్నంకు చెందిన 26 ఏళ్ల పేరూరి రమాదేవికి ఎనిమిదేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన దుర్గా ప్రసాద్ తో పెళ్లయింది. భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని అందరూ అంటున్నారు. కాగా, గత కొద్ది రోజులు క్రితం పిల్లలతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటుంది. 



భర్త లారీ క్లీనర్. వెళ్లిన ప్రతీసారి పది, పదిహేను రోజులకు ఓసారి ఇంటికి వచ్చేవాడు. అదే సమయంలో భార్యకు నర్సీపట్నంలో హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయం భర్తకు తెలిసింది. అయితే ఇటువంటివి మంచిది కాదు మానుకోమని చెప్పాడు.ఈ విషయమై కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త డ్యూటీకి వెళ్లగానే రోజూ రాత్రిళ్లు ఆ యువకుడు ఆమె ఉంటున్న ఇంటికి వచ్చేవాడని పిల్లలు చెబుతున్నారు.



 ఈ క్రమంలోనే దుర్గాప్రసాద్ రెండ్రోజుల క్రితం డ్యూటీకి వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఆ యవకుడు రమాదేవి ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఏమయిందో ఏమో, తెల్లారుజామున ఆమె హతమయి ఉండటాన్ని చూసి పిల్లలు భయపడిపోయి పక్కింటి వాళ్లకు చెప్పారు. దీంతో వాళ్లు భర్త దుర్గాప్రసాద్ కు సమాచారం ఇచ్చారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంబంధం వద్దని ఆమె చెప్పడం వల్ల ఆమెను చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: