విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియక ఇక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అంతు పట్టక అటు విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యాశాఖ విద్యా సంస్థలను ప్రారంభించడం పై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు డిగ్రీ విద్యార్థులకు విద్యా బోధన సహా పరీక్షల నిర్వహణ గురించి క్లారిటీ రాలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థులు గందరగోళ పరిస్థితి నెలకొంది అయితే ఇటీవలే డిగ్రీ పరీక్షలపై ఉన్నత విద్యామండలి చైర్మన్ క్లారిటీ ఇచ్చారు.
డిగ్రీ విద్యార్థులు అందరికీ కూడా ఫిబ్రవరి 1 నుంచి జూన్ వరకు తరగతులు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఇక జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.ఉదయం బిఏ, బీకామ్ విద్యార్థులకు పరీక్షలు ఉంటే ఇక మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే అన్ని యూనివర్సిటీల లో కూడా హాస్టల్ సదుపాయాన్ని కూడా ప్రారంభించేందుకు నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీకి రావాలి నిబంధన లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన.