కానీ ఇటీవలే టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ పక్షులపై ప్రేమ చూపించి చివరికి వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇటీవలే వారణాసి లో పర్యటించిన శిఖర్ ధావన్ అక్కడ గంగానదిలో బోటులో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే నదిలో ఉన్న పక్షులకు ఆహారం అందజేశాడు శిఖర్ ధావన్. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పక్షులకు ఆహారం వేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ శిఖర్ ధావన్ ను వివాదాల్లోకి నెట్టింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి శిఖర్ ధావన్ స్వయంగా తన చేతులతో పక్షులకు ఆహారం అందించడం పై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అయితే నిబంధనలు ఉల్లంఘించి నదిలోకి బోట్ తీసుకెళ్లినందుకు గానూ బోట్ యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. పర్యాటకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే బోట్ నడిపే వారికిప్రభుత్వ నిబంధనల పై ఎంతో అవగాహన ఉన్నప్పటికీ బోట్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వారు అవగాహన కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ చేసిన పని కాస్తా ప్రస్తుతం వివాదాస్పదంగా మారి పోయింది.