ఎవరో మంత్రగాళ్ళు చెప్పారని లేదా.. బలి ఇవ్వడం కారణంగా ఎంతో మంచి జరుగుతుంది అని భావించి ఇప్పటికి కూడా కొంతమంది ఏకంగా కన్న పిల్లలను సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్న ఘటనలు తెర మీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏకంగా ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి కి మతి స్థిమితం లేకపోవడం కారణంగానే ఇద్దరు కూతుళ్ల ప్రాణాలు తీసింది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజాలు బయట పడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆధ్యాత్మిక మాయలోనే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చిన ట్లు తెలుస్తోంది. పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఒక్కరాత్రి ఆగితే తమ పిల్లల ప్రాణాలతో లేచి వస్తారు అంటూ తల్లిదండ్రులు చెబుతున్నారని దీన్ని బట్టి చూస్తే వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక మాయలో పడిపోయారు అంటూ పోలీసులు తెలిపారు. వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు అని అయినప్పటికీ ఇలా ఆధ్యాత్మిక మాయలో పడి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.