ఇక ఇటీవలే గుంటూరులో వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ విషయం వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక కు చెందిన బొక్క విజయలక్ష్మి ఆశా కార్యకర్తగా పీహెచ్సీ పరిధిలో విధులు నిర్వహిస్తోంది. అయితే ఈనెల 20వ తేదీన విజయలక్ష్మి వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ తర్వాత తలనొప్పి వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఇక వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్పడంతో ఈ లక్షణాలను అంతగా పట్టించుకోలేదు ఆశ కార్యకర్త. ఆ తర్వాత ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయింది.
ఇక ఆమెను మెరుగైన వైద్య సేవల కోసం ఈనెల 22వ తేదీన గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రికి తరలించగా ఇక ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్ విభాగంలో సేవలు అందించారు వైద్యులు. ఈ క్రమంలోనే బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు పరుగున గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి వెళ్లారు. ఇక మృతురాలుకుటుంబ సభ్యులను పరామర్శించారు అధికారులు.