బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇతర పార్టీ ల అభ్యర్థులు పోటీలో ఉండకూడదనే విధానం సరి కాదు అని మండిపడ్డారు. గతంలో జరిగిన బెదిరింపులు వంటి వాటిని నిరోధించాలి అని ఆయన కోరారు. మేము ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియ పై చర్చించుకుంటాం అని అన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితే గవర్నర్ దృష్టి కి తీసుకెళతాం అని స్పష్టం చేసారు. బిజెపి, జనసేన సంయుక్తంగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తాయి అని స్పష్టం చేసారు.
ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసేలా చేయాలని మేము కోరుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక విధాలుగా అభ్యర్థులను అడ్డుకున్నారు అని సోము మండిపడ్డారు. 29వ తేదీ లోగా ఆన్ లైన్ విధానం పై చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి పై మాకు స్పష్టమైన విధానం ఉంది అని అన్నారు. ఇరు పార్టీలు పొత్తుతో... అందరకీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఇరు పార్టీ లకు ఎక్కడెక్కడ ఎంత బలం ఉందో చూసి.. అభ్యర్థులను ఎంపిక చేస్తాం అని అన్నారు.