ఇక కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బిజెపి సహా తెరాస పార్టీలు అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే... మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజల ఊసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. అవినీతికి ప్రత్యేక మ్యాప్ వేసుకుని కాంగ్రెస్ ప్రాజక్టుల డిజైన్ చేసింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదు అని అన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. ఉత్తమ్ తన ఎంత ఎత్తు అవినీతిలో కూరుకుపోయాడు అని ఆయన మండిపడ్డారు. జైల్ కు వెళ్ళిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకుంది అని అన్నారు. ఫ్లోరిన్ నుంచి నల్లగొండ జిల్లాను రక్షించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు. ప్రజల కోసం కట్టే ప్రాజక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన విమర్శించారు.