ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సిద్దం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో వరుసగా చర్చలు జరుపుతూ అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఇక ఏపీలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ కూడా ఆందోళనకరంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇక ఆయన కలెక్టర్ లతో నేడు సమావేశం అయ్యారు.

ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అన్నారు. అది కేవలం పోలింగ్ కేంద్రం లో కొద్ది ప్రాంతాన్ని మాత్రమే రికార్డ్ చేయగలుగుతుంది అని ఆయన అన్నారు. వెబ్ కాస్టింగ్ లో పూర్తి స్థాయి నాణ్యత వుండటం లేదు అని అన్నారు. వెబ్ కాస్టింగ్ పరిధి దాటి జరిగే సంఘటనల మాటేంటి? అని ప్రశ్నించారు. దీని కోసం ఎలక్షన్ కమీషన్ ఒక ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది అని ఆయన పేర్కొన్నారు.

ఈ యాప్ ద్వారా పౌరులు ఎవరైనా గొడవలు ఇతరత్రా అసాంఘీక చర్యల పై వెంటనే సమాచారం పంపోచ్చు అని సూచించారు. వీడియోతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపే వెసలుబాటు వుంటుంది అని అన్నారు. వాక్సినేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు.. అందుకు తగ్గ ఏర్పాట్లు పక్కాగా జరగాలి అని ఆయన ఆదేశాలు జారీ చేసారు. అధికారులు కూడా ఎన్నికల ప్రక్రియకు సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు. కొంతమంది అధికారులు ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకించారు అని అన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టాల్సి వచ్చింది అని నిమ్మగడ్డ స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: