అయితే ఇందుకు అనుగుణంగానే పల్లె ప్రజలను ఆకర్షించే విధంగా సీఎం జగన్ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారని... అభివృద్ధిని పక్కనపెడితే పల్లె ప్రజలకు దగ్గరయ్యేలా పలు పథకాలతో వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైతన్న భరోసా, నాడు నేడు స్కూళ్లు, డ్వాక్రా మహిళలకు డబ్బులు, ఇంటింటికి రేషన్, ఇంటింటికి పెన్షన్, గ్రామ సచివాలయాలు ఇలా ఈ సంక్షేమ పథకాలను చూస్తుంటే జగన్ సర్కార్ గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ఆసక్తి చూపినట్లు అనిపిస్తోంది అంటున్నారు. ఇకపోతే ఇదే వైఖరి పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావం ఏర్పడేందుకు కారణమైంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. అభివృద్ధిలో భాగమైన మౌలిక సదుపాయాలను కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లు వేయడం వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు గ్రామాలలోనూ అటు పట్టణాల్లోనూ పెద్దగా కనబడడం లేదు.
డబ్బులు పంచుతూ... అరకొర సంక్షేమ పథకాలతో సరిపెడుతున్నారు తప్ప.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నాం కదా అని మన గ్రామీణ ప్రాంతాలలో నాడు నేడు, కొత్త ఆస్పత్రులు, గ్రామ సచివాలయాలు వంటి వాటిని అభివృద్ధి గా భావించి గ్రామీణ ప్రాంతాల ప్రజలు సీఎం జగన్ ను ఆదరిస్తారా.. లేక అసలైన అభివృద్ధి కోసం జగన్ ను వ్యతిరేకిస్తారా.. అన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు పలు రాజకీయ నేతలు. ఒకవేళ గ్రామీణ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే జగన్ సర్కార్ తిరిగి మళ్లీ అదే రూట్లో వెళుతుంది లేదా గ్రామీణ ప్రజలు ఇది అభివృద్ధి కాదు అని నిరాకరిస్తే... వైయస్ జగన్ మౌలిక సదుపాయాలను పెంచి... అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.