ఈ నేపధ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ లు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్.. కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికలు నాల్గు దఫాలుగా జరుగుతాయి అని ఆయన అన్నారు. తొలి విడత లో తెనాలి డివిజన్ ఎన్నికలు జరుగుతాయి అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ రోసం 357 స్టేజ్ వన్ ఆఫీసర్లు ఉంటారు అని స్పష్టత ఇచ్చారు. 30 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటారు అని ఆయన అన్నారు. 11వేల బ్యాలెట్ బాక్స్ లు ఎంపిడీవోల ఆదీనంలో ఉంటాయి అని ఆయన అన్నారు.
గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా శాంతిభద్రతల పరిరక్షిస్తాం అని స్పష్టం చేసారు. అభ్యర్ధులు కోవిడ్ నిబంధనలు పాటించాలి అని స్పష్టత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలలో శానినిటేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని ఆయన సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం అని అన్నారు. 08632218089 కి ఫోన్ చేయాలని సూచించారు. ఎలక్షన్ కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా ఎలక్షన్ అధికారులు ప్రవర్తించాలి అని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఉద్యోగుల అందరికి సెలవులు రద్దు చేశాం అన్నారు. అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తే స్పాట్ లో తీవ్ర చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు.