మొన్నటి వరకు కరోనా భయంలో ఉన్న ప్రజలు అది కాస్త తగ్గగానే ఇప్పుడు ప్రముఖ నగరాల్లో క్షుద్ర పూజలు కలవర పెడుతున్నాయి. వాటి వల్ల మూఢ నమ్మకాలతో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. . ఆంధ్ర ప్రదేశ్ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని జనాలు భయంతో వణికిపోతున్నారు.ఇటీవల మదనపల్లిలో జరిగిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన జరిగింది.

 

ఇలా చిత్తూరులో వరుస ఘటనలు జరగడం పై జనాలు మాత్రం భయం తో వణికిపోతున్నారు. ఈ పూజల పేరుతో ఎవరిని చంపుతారు అన్న అంశం ఇక్కడ అందరి మదిని కలచి వేస్తోంది. చిత్తూరు మదన పల్లెలో ఇటీవల వెలుగు చూసినా దారుణం సొంత తల్లే పిల్లలను చంపడం. మూడ నమ్మకాలు ఎక్కువ కావడంతో దేవుడు తన బిడ్డలను మళ్లీ పుట్టిస్తారు అనే భ్రమతో ఆమె కడుపున పుట్టిన పిల్లలను అతి దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉంది. ఇప్పుడు ఘటన వెలుగు చూసింది..



వివరాల్లోకి వెళితే.. చిత్తూరులో ఈ ఘటన జరిగింది. బి.కొత్తకోటలో మరో క్షుద్రపూజల కలకలం రేగింది. క్షుద్రపూజల ముసుగులో తమ కుమార్తెను మోసపూరిత పెళ్లి చేసుకున్నారని అబ్బాయి, భూతవైద్యునిపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను లోబర్చుకుని చరణ్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడని యువతి తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లి తర్వాత ఇప్పుడు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని చెబుతున్నారు. క్షుద్ర పూజల వైద్యం చేసిన వెంకటరెడ్డి, చరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చరణ్ , అతని తరపు బందువుల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరులో వరుసగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. అధికారులు వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: