తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన, కలకలం స్పష్టించిన మదనపల్లి అక్కాచెల్లెల హత్య కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. జంట హత్యలపై పోలీసులు విచారణ జరుగుతున్న కొద్ది.. కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. అక్కాచెల్లెల్లిద్దరినీ ఆ తల్లిదండ్రులిద్దరూ దారుణంగా హత్య చేసిన రోజు వారిని ప్రత్యక్షంగా చూసిన వారు అసలేం జరిగిందన్నది వెల్లడిస్తున్నారు.
తాజాగా వాళ్లింట్లో దారుణం జరిగిన రోజే.. మంత్ర పూజలు చేసిన భూత వైద్యుడు నిజాలను చెప్పాడు.

         బుగ్గకాలువ ప్రాంతానికి చెందిన భూత వైద్యుడు సుబ్బరామయ్య చెప్పిన వివరాల ప్రకారం..
దారుణ ఘటన జరిగిన రోజున ఆ తల్లిదండ్రులే అతన్ని ఇంటికి పిలిపించారట.  గత శనివారం ఉదయం భాస్కర్, రాజు అనే అన్నాదమ్ముళ్లు నా వద్దకు వచ్చారు. తమ బంధువులైన పురుషోత్తం నాయుడు, పద్మజ పిల్లలకు సీరియస్ గా ఉందని చెప్పారు. అర్జెంటుగా రావాలని నన్ను తీసుకెళ్లారు. వాళ్లింటికి వెళ్లిన సమయంలో పై అంతస్తులో ఓ అమ్మాయి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందనే ఉండగా వాళ్ల అమ్మ వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరింది. నేను సరేనని చెప్పి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి గుడి దగ్గర పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, తాయత్తులు తీసుకుని ఇంటికి వచ్చా.

            మళ్లీ వాళ్లింటికి వచ్చిన సమయంలో ఆ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో పాటు ఓ సన్నటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ అమ్మాయిల దగ్గర కూర్చుని చెవిలో ఊదడం చూశాను. నేను తెచ్చిన తాయత్తులు, పూజ సామగ్రి తీసుకుని నాకు మూడు వందల రూపాయలు ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇంత ఘోరం జరిగిందని తెలిసి చాలా బాధేస్తోంది‘ అని మంత్రగాడు సుబ్బరామయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.


           మరోవైపు మదనపల్లెలో అక్కాచెల్లెళ్ల హత్యకు ప్రధాన కారణం పెద్ద కుమార్తె అలేఖ్యనే అని తెలుస్తోంది. అలేఖ్యకు పునర్జన్మలపై నమ్మకం ఉంది.  ఆ నమ్మకాన్నే ఆమె తన తల్లిదండ్రుల్లో కలిగేలా చేసింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేసానని.. కుక్కని చంపి మళ్ళీ బ్రతికించానని చెప్పింది. ఆమె మాటలను తల్లిదండ్రులు విశ్వసించారు. అంతేకాదు, చిన్నకుమార్తె సాయి దివ్యపై పునర్జన్మ ప్రయోగాలు చేయడానికి అంగీకరించారు. పునర్జన్మ పేరుతో సాయి దివ్యను చంపేశారు. అయితే ఆమె తిరిగి బ్రతకకపోవడంతో.. అలేఖ్య తనని చంపమని కోరింది. ఇద్దరం కలిసి మళ్ళీ జన్మిస్తామని చెప్పింది. పునర్జన్మ మాయలో పడిపోయిన తల్లి.. అలేఖ్యను కూడా చంపేసింది. ఇలా పునర్జన్మ ప్రయోగాల పేరుతో కన్న తల్లే ఇద్దరు కూతుళ్ళని పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని తండ్రి పురుషోత్తమ నాయుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: