అంటే పంచాయతీలు ఏకగ్రీవం కాకపోతే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భయపదేడుతున్నారు అని... ఏకగ్రీవాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని అందరి ఆమోదంతో చేస్తే ఇబ్బంది లేదు కానీ ఇష్టం వచ్చినట్టు చేయడం ద్వారా పార్టీ ఇబ్బంది పడుతుందని ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది అని కొంతమంది సూచిస్తున్నారు. ఎంత బలంగా ఉన్నా సరే... ఏదైనా పోటీ లేకపోతే బలహీనంగానే కనబడతారు.
ఈ విషయం తెలియని వైసీపీ నేతలు ఇప్పుడు ఏకగ్రీవాల మీద దృష్టి పెడుతూ వస్తున్నారు. గత ఏడాది పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా ప్రకటన చేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. ఇక ఇప్పుడు మరో ముందడుగు వేసి కొంత మంది వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలే తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అసలు పంచాయతీలను ఏకగ్రీవం చేయడం అనే ఆలోచన ఎంతమాత్రం మంచిది కాదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ ఎంత బలంగా ఉన్నా సరే గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి.