ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎప్పట్నుంచో భారతదేశంలో ఆత్మ హత్యలు ఎక్కువవుతున్నాయి.అవి కూడా ఎక్కువగా బంగారు భవిష్యత్తు వున్న యవ్వనస్తులు చేసుకునే సూసైడ్ సమస్యలు రోజు రోజుకి చాలా మీటిమీరిపోతున్నాయి. ఇక తాజాగా చిత్తూరు జిల్లాకి చెందిన ఓ యువకుడు దేవుడి దగ్గరకు వెళుతున్నానని లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అందులో విషయాలు చదివి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. గంగవరం మండలం మార్జేపల్లెకు చెందిన మార్జేపల్లెకు చెందిన శివశంకర్, పద్మజ దంపతులకు గణేష్‌ పెద్ద కొడుకు. మండల కేంద్రానికి సమీపంలోని కాలేజీలో బీకాం డిగ్రీ ఫైనల్‌ ఇయర్.. బాగా చదువుతున్నాడు.

ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. వ్యవసాయం, ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేసేవాడు.ఈనెల 21న రాత్రి నోట్‌బుక్‌లో రెండు పేజీల లేఖను రాసి కనిపించుకుండా పోయాడు. బైక్, మొబైల్, కాలేజీ బ్యాగ్‌ కూడా కనిపించలేదు. అతడు ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. గణేష్ ఆచూకీ తెలియక పోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండగా.. మొబైల్ ఐఎంఏ ద్వారా ఆరా తీస్తున్నారు. అతడు రాసి రెండు పేజీల లేఖ అందరిని కంటతడి పెట్టిస్తుంది.

‘నాన్న! నన్ను క్షమించండి.. నేను దేవుని దగ్గరకు వెళ్లిపోతున్నా. నేను ఎంత మరిచిపోదామనుకున్నా ఈ బాధ రోజురోజుకూ నరకం చూపిస్తోంది. నటించడం ఇక నా వల్ల కాదు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలో అయినా మీరు చెప్పినట్టు నడుచుకునేట్టు ఆ దేవుడిని వరం అడుగుతా. అమ్మా.. నా కోసం మీరు ఎంత ఏడ్చినా నేను ఎక్కడా ఆనందంగా ఉండలేను. నేను అసలు పుట్టనే లేదనుకో. మా తమ్ముడు జాగ్రత్త.. వాడే నేననుకో. నాన్నా.. నీకు ఒకవేళ నేను తలవంపులు తెచ్చింటే నన్ను క్షమించు. తమ్ముడికి కొడుకుగా పుడతా.. మళ్లీ నువ్వే నన్ను పెంచి పెద్ద చేయాలి. అప్పుడే నువ్వు చెప్పినట్టు వింటాను. నేను ఎవరినీ సాధించడానికి ఈ పని చేయలేదు. తమ్ముడూ.. అమ్మానాన్నకు ఇక అన్నీ నువ్వే’ అంటూ లేఖలో తన బాధని వివరించాడు.ఈ లేఖ చదివిన అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: