ఉత్తరాంధ్ర మంత్రులు సైతం విజయ సాయి రెడ్డి ఇక్కడ హడావిడి చేస్తుండడంతో తమను పట్టించుకునే వారే లేరని ఆవేదనతో ఉన్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీలో తీవ్రమైన వర్గ పోరు నడుస్తోంది. సాయి రెడ్డి పెత్తనంపై ఏకంగా ఇద్దరు మంత్రులు, పది మంది ఎమ్మెల్యేల వరకు మండి పడుతున్నారట. అసలు ఉత్తరాంధ్రలో పార్టీ ఎమ్మెల్యేలు అందరిని ఆయన డమ్మీలను చేసి పడేశారని అంటున్నారు. ఇక గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఫ్యాన్ను గిర్రున తిప్పడంలో సాయి రెడ్డి కొంత వరకు చక్రం తిప్పారు.
అందుకే జగన్ ఆయన అక్కడ ఎంత పెత్తనం చేసినా మాట్లాడడం లేదు. అయితే ఈ సారి పంచాయతీతో పాటు ఇతర స్థానిక ఎన్నికల్లో అక్కడ వైసీపీకి మెజార్టీ స్థానాలు రాకపోతే ఊరుకోనని సాయి రెడ్డికే నేరుగా వార్నింగ్ ఇచ్చారంటున్నారు. పైగా అక్కడ రాజధాని ఏర్పాటు ప్రకటన అంశం కూడా మనకు సానుకూలం అవుతుందని.. ఇవన్నీ ప్లస్ చేసుకుని ఉత్తరాంధ్రలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే మనకు అక్కడ పటిష్టమైన పునాది ఏర్పడుతుందని జగన్ సూచనలు చేశారట. అయితే సాయి రెడ్డి పెత్తనాన్ని సహించ లేని వారు మాత్రం ఇక్కడ దెబ్బ పడితే అయినా సాయి రెడ్డి పెత్తనానికి చెక్ పడుతుందన్న ఆశతో ఉన్నారు.