ఈ క్రమంలో టీడీపీ నేతలు కుట్రలకు తెరతీస్తున్నారు. పార్టీ అధినేత చంద్ర బాబు ఆదేశాల మేరకు ఎవరో ఒకరితో నామినేషన్లు వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికల్లో నిలబడుతున్న పెద్దలు అందరూ సమావేశం అవుతున్నారు. ఈ మేరకు పలు చర్చలు జరిపి ఏకగ్రీవం చేసుకొనేందుకు చర్చలు చేస్తున్నారు. ఇవి ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు... కానీ టీడీపీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు..
ఇది ఇలా ఉండగా టిడిపి నేతలు వాటిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి ఉండడంతో వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ లో చేరిన నాయకులను ప్రలోభపెడుతున్నారు. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకర్గాల్లో టీడీపీ నేతలు పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ దాదాపు ఖాళీ అయిన విషయం తెలిసిందే... మరి రే పు ఆ నియోజక వర్గాలు పరిస్థితి ఎలా ఉండబోతుందో.. బాబుగారి నేతల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి... ఎవరికీ వారే ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.. ఫిబ్రవరి 9 న ఎవరి భవిషత్తు ఎంటో తెలియనుంది..