ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజంగానే జరిగింది. పదేళ్ల నుంచి ఒక్క నీటి చుక్క కూడా తాగకుండాఎంతో ఆరోగ్యంగా ఉంటూ వస్తుంది ఇక్కడ ఒక బామ్మ . ఈ ఘటన జనగామ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తరిగొప్పుల లో ప్రమీల అనే 70 సంవత్సరాల బామ్మ ఉంటుంది. గత పదేళ్ల నుంచి నీరు తాగడం మానేసింది బామ్మ. ఇంట్లో కుటుంబ సభ్యులు నీళ్లు తాగమని చెబితే వద్దే వద్దు అంటూ భీష్మించుకు కూర్చుంది.. పదేళ్ల క్రితం అందరిలాగే నేను కూడా మంచి నీళ్ళు తాగేదానినని కానీ ఇప్పుడు ఎందుకో నీరు తాగడం నచ్చడం లేదు అంటూ చెబుతుంది ఈ బామ్మ.
10ఏళ్ళ నుంచి నీళ్లు తాగకుండా ఉన్నప్పటికీ తనలో మాత్రం ఏ మార్పూ రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. చురుకుగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది . సాధారణంగా కాస్త పనిచేసినా కూడా దాహం వేస్తోంది.దాహం వేసిన సమయంలో కొన్ని నీళ్లు కడుపులోకి వెళ్లాయి అంటే ప్రాణం లేచొచ్చింది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బామ్మ పదేళ్ల నుంచి నీళ్లు తాగకుండా ఉండటం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. కుటుంబ సభ్యులు వైద్యులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఒకవేళ బలవంతంగా నీళ్లు తాగిస్తే బయటికి ఉమ్మేస్తుందట.