అక్రమ రిజిస్ట్రేషన్ చేసి దివాకర్ రెడ్డి కేస్ లలో ఇరుక్కొన్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. అక్రమ మైనింగ్ విషయం లో జేసీ కి కోర్ట్ లు అక్షింతలు వేశాయి అని ఆయన ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోజుకు 300 కోట్లు సంపాదిస్తున్నారు అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. దివాకర్ రెడ్డి అన్యాయం గా కూడబెట్టిన ధనం, చేసిన దౌర్జన్యాలు హత్యలు అందరికి తెలుసు అని ఆయన ఆరోపించారు. జేసీ దివాకర్ రెడ్డి మత్తు దిగక మాట్లాడుతున్నారు అని విమర్శలు చేసారు. ఇప్పటికైనా ఆయన ఆ మాటలు అపకపోతే అనంతపురం ప్రజలే ఆయన నాలుక కొస్తారు అని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో 70 వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం అని ఆయన వివరించారు. తాడిపత్రి మున్సిపాలిటీ తో సహా అన్ని మున్సిపాలిటీ, పురపాలికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది అని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రోజుకో రకంగా మాట్లాడుతారు అని ఎద్దేవా చేసారు మంత్రి. ఈ ఉదయం జేసి దివాకర్ రెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.