సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. స్నేహితుడితో కలిసి ఓ యువతి అతిథిగృహానికి రాగా ఆ భవన యజమాని కుమారుడు తనకు తెలిసిన పోలీసులను పిలిపించి పోలీస్‌ రైడ్‌ మాదిరి చేయించాడు. పోలీసులతో ఆ యువతిని బెదిరింపులకు పాల్పడి.. తన కోరిక తీరిస్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని చెప్పి అత్యాచారం చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న అతిథిగృహానికి శనివారం ఓ అమ్మాయి తనకు తెలిసిన వ్యక్తితో వచ్చింది. దీన్ని ఆ అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఆ అమ్మాయిపై కన్ను పడింది. దీంతో తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్‌ రైడ్‌ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్‌ వేశాడు.

దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీన్ని తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఇదంతా జరిగాక ఆ యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే. ఈ వార్త బయటకు రావడంతో ఆ స్టేషన్‌ సీఐ ప్రేమ్‌చంద్‌ శర్మ స్పందించారు.

అయితే మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరిస్తాం. విచారణ చేపడతాం’ అని సీఐ ప్రేమ్‌చంద్‌ శర్మ తెలిపారు. ఈ విధంగా రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి. తమకు తెలిసిన వారితో కుమ్మక్కై ఓ ఆడపిల్లపై అఘాయిత్యం జరగడంతో పాటు బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్‌ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: