ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో కొంతమంది నేతలు కాస్త సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరికొంతమంది నేతలు మాత్రం ఇప్పుడు తెలుగుదేశంలో కాస్త ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే నేతల విషయంలో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆ పార్టీలోకి ఎవరు వస్తారు ఏంటనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడు ఆ పార్టీలోకి కొందరు వచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఒక ప్రముఖ జర్నలిస్టు వచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీలో కొంతమంది జర్నలిస్టులు ఇప్పటికే తమ పనితీరుతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరో జర్నలిస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన చర్చలు జరిపారని ఆర్థికంగా కూడా బలంగా ఉన్న సదరు జర్నలిస్టు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకు ఇచ్చే పదవిపై కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని సమాచారం.

దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఇటీవల చర్చలు జరిగాయని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా ఆయన ముందునుంచి సన్నిహితంగా ఉంటారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఆయనకు ఇచ్చే నియోజకవర్గం ఏంటనే దానిపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో సబ్బంహరి చర్చలు జరిపారని అయితే ఆయనకు విశాఖ జిల్లాలో నియోజకవర్గాన్ని కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: