తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో పోలీసులను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా వైసీపీ ఎక్కువగా నష్టపోతుందని అంటున్నారు. వైసీపీ నేతల్లో కూడా చాలామంది ఈ విధానాల పై ఆగ్రహంగా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే కొంత మంది మంత్రులను చూసి మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో రెచ్చిపోతున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న ఈ రాజకీయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బహిరంగ విమర్శలు చేస్తున్నది. పోలీసులను ఇలాగే వాడుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు.
పోలీసులు కనుక ప్రజల మీద ప్రతాపం చూపితే ప్రజలు ఎన్నికల సమయంలో ప్రజలు ప్రతాపం చూపించే అవకాశం ఉంటుందని కాబట్టి పోలీసులు విషయంలో అది మంచిది కాదు అని సూచిస్తున్నారు. విపక్షాల మీద పోలీసులను ఉపయోగించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది అని సూచన చేస్తున్నారు. ఇదే రాజకీయం భవిష్యత్తులో కూడా కొనసాగితే... అది తెలుగుదేశం పార్టీ కూడా చేస్తే ఏ విధంగా ఇబ్బందులు పడతారో ఒకసారి గ్రహించి దానిపై అడుగులు వేస్తే మంచిది అని కోరుతున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులు కూడా కొంతమంది మీద ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారట. ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేయడానికి మంత్రులు సిద్ధమయ్యారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.